• తాజా వార్తలు

వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

క‌రోనా భూతం రోజురోజుకూ విజృంభిస్తోంది. అందుకే ఎప్పుడూ ఆఫీస్‌లోనే ప‌ని చేయించుకునే సంప్ర‌దాయ సంస్థ‌లు సైతం ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేయమంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో యూజ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది. మూడు నెల‌ల వ్యాలిడిటీతో  వ‌ర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది.

599 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే..  
599 రూపాయ‌ల‌తో ఈ వ‌ర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ ఎస్టీవీని తీసుకుంటే 

* రోజుకు 250 నిముషాల కాల్స్ ఫ్రీ. ఇండియాలో ఏ నెట్‌వ‌ర్క్‌కైనా చేసుకోవ‌చ్చు

* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ

* రోజుకు 5జీబీ డేటా ఇస్తుంది. ఆ త‌ర్వాత స్పీడ్ 80 కేబీపీఎస్ మాత్ర‌మే వ‌స్తుంది. 

* వ్యాలిడిటీ 90 రోజులు. అంటే మొత్తం 450 జీబీ డేటా ఇస్తోంది.

అన్ని స‌ర్కిల్స్‌లోనూ 
బీఎస్ఎన్ఎల్ 599 వ‌ర్క్ ఫ్రం హోమ్ ప్రీపెయిడ్ ఎస్టీవీని దేశ‌మంతా అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ, ముంబ‌యి త‌ప్ప దేశంలోని ఏ బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుడైనా దీన్ని వాడుకోవ‌చ్చు.  

జియో, ఎయిర్‌టెల్‌, ఐడియాల‌కు షాక్ 
ఈ 599 రూపాయ‌ల ధ‌ర‌లో ఏం కంపెనీ కూడా ఇంత బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌ట్లేదు. ఈ ధ‌ర‌లో జియో రోజూ 2 జీబీ డేటా ఇస్తుంది. అది కూడా 84 రోజులే. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ కూడా ఇదే స్థాయిలో డేటా ఇస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ తెచ్చిన ఈ భారీ ఆఫ‌ర్‌తో ప్రైవేట్ టెలికం ఆప‌రేట‌ర్లంద‌రికీ షాకే.   

జన రంజకమైన వార్తలు