రిలయన్స్ జియో తన బ్రాడ్బ్యాండ్ జియో ఫైబర్ మీద డబుల్ డేటా ఆఫర్ను ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో యూజర్లందరికీ పనికొచ్చేలా ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ డబుల్ డేటా ఆఫర్ వివరాలేంటో చూద్దాం రండి.
జియో ఫైబర్ బ్రాంజ్ ప్లాన్
ఈ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 350 జీబీ డేటా వస్తుంది. ఇందులో 100 జీబీ బేస్ డేటా, 100 జీబీ డబుల్ డేటా, 100 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా, మరో 50 జీబీ ప్రవేశ ఆఫర్.
జియో ఫైబర్ సిల్వర్ ప్లాన్
ఈ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 800 జీబీ డేటా వస్తుంది. ఇందులో 200 జీబీ బేస్ డేటా, 200 జీబీ డబుల్ డేటా, 200 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా, మరో 200 జీబీ ప్రవేశ ఆఫర్.
జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్
గోల్డ్ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 1,750 జీబీ డేటా వస్తుంది. ఇందులో 500 జీబీ బేస్ డేటా, 500 జీబీ డబుల్ డేటా, 500 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా, మరో 250 జీబీ ప్రవేశ ఆఫర్.
జియో ఫైబర్ డైమండ్ ప్లాన్
డైమండ్ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 4,000 జీబీ డేటా వస్తుంది. ఇందులో 1,250 జీబీ బేస్ డేటా, 1,250 జీబీ డబుల్ డేటా, 1,250 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా, మరో 250 జీబీ ప్రవేశ ఆఫర్.
జియో ఫైబర్ ప్లాటినం ప్లాన్
ప్లాటినమ్ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 7,500 జీబీ డేటా వస్తుంది. ఇందులో 2,500 జీబీ బేస్ డేటా, 2,500 జీబీ డబుల్ డేటా, 2,500 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా
జియో ఫైబర్ టైటానియం ప్లాన్
గోల్డ్ ప్లాన్లో ఇప్పుడు జియో ఫైబర్ యూజర్కు నెలకు 15,000 జీబీ డేటా వస్తుంది. ఇందులో 5000 జీబీ బేస్ డేటా, 5000 జీబీ డబుల్ డేటా, 5000 జీబీ అడిషనల్ యాన్యువల్ డేటా, మరో 250 జీబీ ప్రవేశ ఆఫర్.
లాక్డౌన్ ఉన్నంతవరకే
ఈ ఆఫర్లన్నీ లాక్డౌన్ ఉన్నంతవరకే వర్తిస్తాయి. లాక్డౌన్ నాలుగో దశ ఈ నెల 31తో ముగుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం దీన్నిమళ్లీ పొడిగిస్తే ఈ ఆఫర్లు తమ యూజర్లకు వర్క్ ఫ్రం హోం చేసుకోవడానికి, ఇంట్లోనే ఉండి ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఉపయోగపడుతుందని జియో ప్రకటించింది