శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్లోని రెండు ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలు ప్రకటించింది. గెలాక్సీ ఏ50 ఎస్, గెలాక్సీ ఎం 21 ధరలపై డిస్కౌంట్ ప్రకటిస్తూ శాంసంగ్ న్యూస్ రిలీజ్ చేసింది.
గెలాక్సీ ఏ50ఎస్
గత సెప్టెంబర్లో 22,900 రూపాయల ప్రైస్ ట్యాగ్తో శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ మార్కెట్లోకి వచ్చింది. ఫిబ్రవరిలో దీని ధరలను 17,499 రూపాయలకు శాంసంగ్ తగ్గించింది. అయితే తర్వాత జీఎస్టీ పెరగడంతో మళ్లీ ఫోన్ల ధరలు పెరిగాయి. 4జీబీ ర్యామ్ వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ ధర 21,070 రూపాయలకు పెరిగింది. అలాగే 6జీబీ వెర్షన్ 26,900 రూపాయలు అయింది.
ఇప్పుడు తాజాగా మళ్లీ వీటి ధరలను శాంసంగ్ తగ్గించింది. 4జీబీ ర్యామ్ వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ ధర 21,070 రూపాయల నుంచి 18,599కు తగ్గించింది. అంటే 2,401 రూపాయలు తగ్గింది. 6జీబీ వెర్షన్ 26,900 రూపాయల ,నుంచి 20, 561 రూపాయలకు తగ్గింది. అంటే 6,400 రూపాయలు అదనంగా ఆదా చేసుకోవచ్చని శాంసంగ్ ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం21
మరోవైపు జీఎస్టీ పెరుగుదలతో 14,222 వరకు ధర పెరిగిన గెలాక్సీ ఎం21 4జీబీ ర్యామ్ వెర్షన్ స్మార్ట్ఫోన్ ధరను 13,199కి తగ్గించింది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధరను 16,329 నుంచి 15,499కి తగ్గించినట్లు శాంసంగ్ తెలిపింది.