• తాజా వార్తలు

ఏడాది పాటు వొడాఫోన్ ఉచిత సేవలు, జియోకి ఝలక్

వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది.  ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్‌తో జతకట్టింది. 

వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ఏడాదిపాటు ఈ సేవలను ఇలానే ఉచితంగా పొందొచ్చు. యూజర్ ఈ ఆఫర్ సొంతం చేసుకోవాలంటే వొడాఫోన్ ప్రస్తుత ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయ్యి ఉండాలి. వొడాఫోన్ వెబ్‌సైట్‌కు వెళ్లి సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్‌స్క్రైబర్‌కు క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత తొలి నెలలో కనీసం రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఏ వస్తువు మీద అయినా ఖర్చు చేయవచ్చు. దానికి ఎటువంటి పరిమితి లేదు. 

ఈ విధంగా చేసిన వొడాఫోన్ యూజర్లు ఏడాదిపాటు ఉచితంగా రోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో హైదరాబాద్ సర్కిల్ కూడా ఉంది. Delhi, Noida, Gurugram, Jaipur, Chandigarh, Ahmedabad, Mumbai, Bengaluru, Pune, Hyderabad, Kolkata, Secunderabad, Chennai, Baroda, and Coimbatore ఈ నగరాల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 

జన రంజకమైన వార్తలు