• తాజా వార్తలు

జీఎస్టీ దెబ్బకు ఐఫోన్లు దిగొచ్చాయి... ధర ఎంతో తెలిస్తే మీరూ కొనేస్తారు

జీఎస్టీ అమలుకు అంతా సిద్ధమైంది. జులై 1 నుంచి ఈ ఏకరూప పన్ను ఫోర్సులోకి రానుంది. దీనికి ఇంకా 15 రోజులే మిగిలిఉంది. ఈ లోపల పాత స్టాక్ న్నంతటిన్నీ విక్రయించుకోవడం కోసం రిటైలర్లంతా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్లోనూ అంతా ఆఫర్లే నడుస్తున్నాయి. తాజాగా పేటీఎం కూడా అదే బాట పట్టింది.
కారు చౌకగా
ప్రీ-జీఎస్టీ క్లియరెన్స్ సేల్ పేరుతో పేటీఎంలో లక్షలాది వస్తువులు తక్కువ ధరకు విక్రయానికి పెట్టారు. ఈ సేల్ లో ఐఫోన్లపై పేటీఎం భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
భారీ తగ్దింపు
ఐఫోన్ 7(128జీబీ, జెట్ బ్లాక్ కలర్) పై 24 శాతం డిస్కౌంట్ ను పేటీఎం ఆఫర్ చేస్తోంది. దీంతో 70వేల రూపాయలుగా ఉన్న ఈ ఐఫోన్ 53,333కే అందుబాటులో ఉంది. దాంతో పాటు 32జీబీ ఐఫోన్ 7ను 46,182 రూపాయలకే విక్రయిస్తోంది. కాగ, ఈ ఫోన్ ఒరిజినల్ ధర 60వేల రూపాయలు. ఐఫోన్ 6ఎస్ 32జీబీ ఫోన్ ను కూడా కొనుగోలు దారుల కోసం 36,666రూపాయలకు, ఐఫోన్ 6ను 27,285 రూపాయలకు అందుబాటులో ఉంచింది. ఈ డిస్కౌంట్లతో పాటు ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై 7000 రూపాయల క్యాష్‌ బ్యాక్, ఐఫోన్ 7 ప్లస్ 256జీబీ స్మార్ట్ ఫోన్ పై 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను పేటీఎం అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 7 రెడ్ కలర్ ఒరిజినల్ స్మార్ట్ ఫోన్ ధర 80వేల రూపాయలైతే, ఈ ఫోన్ ను కూడా 70,999రూపాయలకే విక్రయిస్తోంది.
లెనోవా ల్యాపీలపైనా ఆఫర్లు
వీటితో పాటు లెనోవో ల్యాప్ టాప్ పై 20వేల రూపాయల క్యాష్ బ్యాక్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లపై 10వేల రూపాయల డిస్కౌంట్ ను, ఎల్ఈడీ టీవీలపై 20వేల తగ్గింపును పేటీఎం ఆఫర్ చేస్తోంది.
ఈ క్లియ‌రెన్సు సేల్ ప్ర‌స్తుతానికి ముగిసినా మ‌రో విడ‌త కూడా క్లియ‌రెన్సు సేల్ పెట్ట‌డానికి పేటీఎం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

జన రంజకమైన వార్తలు