జియో 500 రూపాయలకే VoLTE టెక్నాలజీతో పని చేసే ఫీచర్ ఫోన్ తెస్తుందన్న వార్తలతో అందరూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్లలో మాత్రమే జియో పని చేస్తోంది. అదే 500 రూపాయలకే VoLTE టెక్నాలజీతో పని చేసే ఫీచర్ ఫోన్ వస్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవకాశం లభిస్తుంది. టోటల్గా ఇది జియో యూజర్ బేస్ను భారీగా పెంచే అవకాశాలున్నాయి. ఈ నెల 21న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)లో ఈ ఫోన్ గురించి ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఫోన్ను లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది.
KAI ఓఎస్తో రానున్న ఫోన్
ఎల్వైఎఫ్ బ్రాండ్తో వచ్చే ఈ VoLTE ఫీచర్ ఫోన్ ఇమేజెస్ తాజాగా ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. HTML5- బేస్డ్ ఫైర్ఫాక్స్ ఓఎస్ నుంచి విడిపోయిన KAI ఓఎస్తో ఈ ఫోన్ రన్నవుతుందని తెలుస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్లతోపాటు జియో యాప్ లు కూడా పని చేస్తాయి. 2.4 ఇంచెస్ కలర్ డిస్ప్లే, 512 ఎంబీ ర్యామ్, * 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (128 జీబీవరకు ఎస్డీ కార్డ్తో ఎక్స్పాండ్ చేసుకునేవీలు) ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు. 2 ఎంపీ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ ఎండ్లో
వీజీఏ కెమెరా ఉంటాయి.
2000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉండొచ్చు. గతంలో వచ్చిన ఫీచర్ ఫోన్లతో పోల్చుకుంటే ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు.