ఎయిర్‌టెల్ ఖాతాదారుల‌కు 1జీబీ డేటా ఫ్రీ 

ఎయిర్‌టెల్ సెలెక్టెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అద‌న‌పు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. 

జియో బాట‌లోనే.. 
గ‌తంలో జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2జీబీ డేటాను నాలుగురోజుల‌పాటు ఉచితంగా అందించింది.  ఇప్పుడు అదేబాట‌లో ఎయిర్‌టెల్ వెళుతోంది. 

రూ.48 డేటా ప్యాక్‌తో 
* రూ. 48 డేటా ప్యాక్‌ను రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు  3జీబీ వ‌స్తుంది. ఇప్పుడు దీనికి 1 జీబీ ఫ్రీ డేటా కూడా క‌లిసి  మొత్తం 4జీబీ డేటా లభిస్తుంది. 
* రూ. 49 స్మార్ట్ రీచార్జ్ ప్యాక్‌పైనా అదనపు డేటా లభిస్తుంది. సాధార‌ణంగా ఈ ప్యాక్‌లో  రూ. 38.52 టాక్ టైం  ఇస్తుంది. దీంతోపాటు నామ‌మాత్రంగా 100 ఎంబీ డేటా ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్యాక్‌కు కూడా  అదనంగా 1జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. 

మూడు రోజుల్లో వాడేయాలి
అయితే ఈ అదనపు 1జీబీ డేటాకు మూడు రోజులే  కాలపరిమితి. ఆలోపు వాడుకోక‌పోతే పోయిన‌ట్లే.   
 

ఎయిర్‌టెల్ ఫ్రీ డేటా ఆఫ‌ర్‌ ఎయిర్‌టెల్ ఆఫ‌ర్‌ Airtel free Data offer Airtel 1gb Data free Â