• తాజా వార్తలు

ఎల్ఈడీ బల్బులు వల్ల ఎంత ప్రమాదమో తెలుసుకోండి

విద్యుత్‌ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎల్‌ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఈ బల్బుల వ‌ల్ల మ‌న కంటిలో ఉండే రెటీనా శాశ్వ‌తంగా దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంద‌ట‌. ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తేలింది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ ఏజెన్సీ ఫ‌ర్ ఫుడ్‌, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆక్యుపేష‌న‌ల్ హెల్త్ అండ్ సేఫ్టీ (ఏఎన్ఎస్ఈఎస్‌) సంస్థ‌కు చెందిన ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఎల్ఈడీ బ‌ల్బులు కంటి చూపును దెబ్బ‌తీస్తాయ‌ని తేలింది. 

సంప్ర‌దాయ సోడియం బ‌ల్బుల క‌న్నా ఈ ఎల్ఈడీ బ‌ల్బులే మ‌న ఆరోగ్యానికి ఎక్కువ‌గా హాని చేస్తున్నాయ‌ని ఈ సర్వేలో తేలింది. ఎల్ఈడీ బ‌ల్బులు ఫోటో టాక్సిక్ వ‌స్తువుల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌న కంటిలోని రెటీనా లోప‌ల ఉండే క‌ణాలు ఎల్ఈడీ బ‌ల్బుల వ‌ల్ల నాశ‌న‌మై పోతాయ‌ని, దాంతో మ‌నం కంటి చూపును కోల్పోతామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూలైట్‌(నీలికాంతి) ఎక్కువస్థాయిలో ఉండటం వల్ల అది కంటిచూపును దెబ్బతీస్తుందని వెల్లడించింది. ఈ బల్బుల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. వెలుగుతున్న ఎల్‌ఈడీ బల్బులను నేరుగా చూడటం చేయకూడదని, రాత్రి నిద్రపోయే సమయంలో బల్బులను ఆఫ్‌ చేసి పడుకోవాలని పేర్కొంది. మొబైల్‌ ఫోన్స్‌, లాప్‌టాప్స్‌, ట్యాబ్లెట్లనుంచి వెలువడే నీలికాంతి కంటే ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

అయితే ఎల్ఈడీ బ‌ల్బుల‌ను నేరుగా చూడ‌క‌పోతే చాల‌ని, దాంతో కొంత వ‌ర‌కు కంటి చూపు స‌మ‌స్య రాకుండా చూసుకోవచ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక రాత్రి పూట నిద్ర‌పోయేటప్పుడు ఎల్ఈడీ బ‌ల్బుల‌ను క‌చ్చితంగా ఆఫ్ చేయాల‌ని కూడా వారు సూచిస్తున్నారు. 

జన రంజకమైన వార్తలు