• తాజా వార్తలు

రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్  కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో రికార్డ్ అవుతుంది. డ్రైవర్లను హెచ్చరిస్తూ ఉంటుంది.

ఈ కెమెరా ధర రూ.5,200. ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా కంపెనీ దీన్ని రూ.699 తక్కువకు ఇస్తోంది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాను కారు అద్దానికి అతికించుకోవచ్చు. దీంతో డైలీ ఈవెంట్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. కెమెరాతో 165 డిగ్రీల్లో హైడెఫినేషన్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. దీంతో రికార్డు అయ్యే వీడియోలను డైరెక్ట్‌గానే కార్డులో స్టోర్ అవుతాయి. 

స్మార్ట్ డాష్ కెమెరాలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది డ్రైవర్లకు రియల్‌ టైమ్‌లోనే హెచ్చరిస్తూ ఉంటుంది. రోడ్డు లైన్ క్రాస్ అయితే వెంటనే వార్నింగ్ ఇస్తుంది. అలాగే ముందు జరగబోయే ప్రమాదాన్ని కూడా హెచ్చరిస్తుంది. కారు వేగాన్ని తగ్గించకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలియజేస్తుంది. 

వైఐ స్మార్ట్ డాష్ కెమెరా‌లో 2.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. దీనిపై రికార్డ్ అయిన వీడియోను చూడొచ్చు. వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో జీ సెన్సర్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఆటోమేటిక్‌గానే ఫోటోలు రికార్డు చేస్తుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫీచర్ ఉంది. జీ సెన్సర్ కూడా ఇందులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ కెమెరాను కొనుగోలు చేయవచ్చు.

జన రంజకమైన వార్తలు